మల్లు రమేష్ అంత్యక్రియలు పూర్తి

|

Jul 01, 2019 | 5:05 AM

పీసీసీ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ మల్లు అనంత రాములు తనయుడు మల్లు రమేష్ అంత్యక్రియలు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జరిగాయి. మాజీ కేంద్రమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.  మల్లు రమేష్ తన ముఖ్య అనుచరుడు కావడంతో స్వయంగా రేణుకా చౌదరి ఆయన పాడె మోశారు. కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్కలు మల్లు రమేష్ కు సోదరులు. రేణుకా చౌదరితో […]

మల్లు రమేష్ అంత్యక్రియలు పూర్తి
Follow us on

పీసీసీ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ మల్లు అనంత రాములు తనయుడు మల్లు రమేష్ అంత్యక్రియలు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జరిగాయి. మాజీ కేంద్రమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.  మల్లు రమేష్ తన ముఖ్య అనుచరుడు కావడంతో స్వయంగా రేణుకా చౌదరి ఆయన పాడె మోశారు. కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్కలు మల్లు రమేష్ కు సోదరులు. రేణుకా చౌదరితో పాటు సీఎల్పీ నాయకులు, మధిర ఎమ్మెల్యే, మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు మల్లు రమేష్‌కు నివాళి అర్పించారు.