‘జోహార్’ మూవీ నుంచి `నీవే సాగిపో అలా…` అనే పాటను రష్మిక మందాన విడుదల చేశారు. తొలి పాట `నీవే సాగిపో అలా…` పాట బావుందని అన్నారు. ఇది కచ్చితంగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఇది పెద్ద హిట్ కొడుతుందని అభిప్రాయపడ్డారు.
I hope all of you like this song as much as I liked it!? All the best to the team♥️@ActorAnkith @theestheranil @NainaGtweets @99_chaitu @DirTejaMarni @sandeep_marni @priyadarshan_09 @MadhuraAudio @JohaarMovie https://t.co/P0MoV9eFbQ
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2020
‘జోహార్ టీజర్’ను రిలీజ్ ను టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆగస్ట్ 14న ‘ఆహా ఓటీటీ యాప్’లో ఈ సినిమా విడుదల అవుతోంది. పొలిటికల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్’ చిత్రం.
ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భాను సందీప్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి పోస్టర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రశంసలు పొందింది జోహార్ చిత్రం.
అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు ఓటీటీ మాధ్యమంగా ’ఆహా’ అని పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫరెంట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ‘జోహార్’ చిత్రంతో పాటు మరికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి.