ప‌వ‌న్ అభిమానుల మృతిపై హీరో రామ్ చరణ్ దిగ్ర్భాంతి

|

Sep 02, 2020 | 11:06 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు...

ప‌వ‌న్ అభిమానుల మృతిపై హీరో రామ్ చరణ్ దిగ్ర్భాంతి
Follow us on

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన జనసేనాని ప‌వ‌న్ కళ్యాణ్, వ‌కీల్ సాబ్ టీం ఒక్కో కుటుంబానికి రూ.2ల‌క్ష‌ల రూపాయ‌లు అందించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

ఇక ఈ ఘ‌ట‌న‌పై మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా స్పందించారు. కుప్పంలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు యువకులు మ‌ర‌ణించార‌నే వార్త న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, ప్రాణం కంటే ఏది విలువైన‌ది కాదు. మీరు ఎల్ల‌ప్పుడు ఇది గుర్తు పెట్టుకొని జాగ్ర‌త్తగా ఉండాల‌ని నా మ‌న‌వి. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తూ , వాళ్ళు కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చ‌ర‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.