దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పట్టణాలు, పల్లెలు అనే తేడాలు లేకుండా విస్తరిస్తుంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ బారినపడిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతి కూడా చేరారు. ఇటీవల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా సీజేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సీఎం గెహ్లాట్ ట్వీట్లో సమాచారం ఇచ్చారు. . ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతికి కోవిడ్ 19 పాజిటివ్ గా వచ్చినట్లు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సీజే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం ట్వీట్ వేదికగా తెలిపారు.
I have come to know Chief Justice of #Rajasthan High Court, Sh. Indrajit Mahanty has tested positive for #Covid_19…concerned about his health. Wish him a speedy recovery.
— Ashok Gehlot (@ashokgehlot51) August 15, 2020
కాగా, శనివారం జస్టిస్ మహంతి కోర్టు అవరణలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, వంద మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఆదివారం వైరస్ పరీక్షించాలని అధికారులు కోరారు. పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందం రాజస్థాన్ హైకోర్టు బార్ కార్యాలయానికి చేరుకుంది. ఇక, ఇప్పటివరకు రాజస్థాన్లో 58,900 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అటు రాజస్తాన్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 846 మంది మరణించారు.