కోవిందుడి రాకకోసం..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు కోవింద్‌ శీతాకాల విడిది చేయనున్నారు. 20వతేదీ మధ్యాహ్నం 1గంటకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారన్నది సమాచారం. 20 నుంచి 22 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. 23న తిరువనంతపురం వెళ్లనున్నారు. 26న సాయంత్రం హైదరాబాద్ కు రాష్ట్రపతి తిరిగి రానున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ […]

కోవిందుడి రాకకోసం..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 12:21 PM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు కోవింద్‌ శీతాకాల విడిది చేయనున్నారు. 20వతేదీ మధ్యాహ్నం 1గంటకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారన్నది సమాచారం. 20 నుంచి 22 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. 23న తిరువనంతపురం వెళ్లనున్నారు. 26న సాయంత్రం హైదరాబాద్ కు రాష్ట్రపతి తిరిగి రానున్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనపై రాష్ట్రపతి భవన్‌ నుంచి సమాచారం అందుకున్న సిటీపోలీసులు.. పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలూ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన విడిది చేసే బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రజలెవరూ ప్రవేశించకుండా.. పోలీసులు నిషేధం విధించారు. ఇక రాష్ట్రపతి పర్యటన నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపైనా, బందోబస్తు ఏర్పాట్లపైనా సీఎస్ ఆరా తీశారు.

ఇక, సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిలయంలో సామాన్యప్రజలకు ప్రవేశం ఉండదు. గట్టి పోలీసు భద్రత ఉంటుంది. కానీ ప్రతి ఏడాది రాష్ట్రపతి శీతాకాల విడిది తరువాత వారం రోజుల పాటు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు. ఏడాదిలో ఓ నెల రోజులు మాత్రం, అదీ రాష్ర్టపతి హైదరాబాద్ వస్తున్నారంటే, ఆయా ఏర్పాట్లు చూసే అధికారులు, సంబంధిత సిబ్బందితో రాష్ర్టపతి నిలయం సందడిగా పలు ప్రభుత్వశాఖల అధికారులతో నిండిపోతుంది. 2011 నుంచి రాష్ర్టపతి పర్యటనకు వచ్చి తిరిగి వెళ్లిన అనంతరం వారం రోజులపాటు సాధారణ పౌరులకు ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కలిపిస్తున్నారు.

రాష్ట్రపతి నిలయం సందర్శనను తీపి గుర్తుగా ఉంచుకోవడానికి సందర్శకులు కెమెరాలతో ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే వాహనాల ద్వారా రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశం ఉంటుంది. మిగతా వారు రాష్ట్రపతి నిలయం ఎదుట ఉన్న పార్కింగ్ లో తమ వాహనాలను నిలపాలి. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?