మూడు రాజధానులపై బాబు ఫైర్..తుగ్లక్ పాలన అంటూ..

|

Dec 17, 2019 | 8:45 PM

ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టారు.  ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా..3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తేల్చిచెప్పారు. అమరావతిలో లెజిస్లేచర్ , వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు వంటివి ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. కాగా సీఎం నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్‌పై ఓ […]

మూడు రాజధానులపై బాబు ఫైర్..తుగ్లక్ పాలన అంటూ..
Follow us on

ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టారు.  ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా..3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తేల్చిచెప్పారు. అమరావతిలో లెజిస్లేచర్ , వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు వంటివి ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. కాగా సీఎం నిర్ణయంపై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్‌పై ఓ స్థాయిలో విమర్శల దాడికి దిగారు.

మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు ప్రెస్‌ మీట్ మెయిన్ అప్‌డేట్స్ :

రాజధానిపై స్పష్టత అడిగితే సస్పెండ్ చేస్తారా..?

పక్కా ప్లాన్ ప్రకారమే రాజధానిపై వైసీపీ ముందుకు వెళ్తోంది

వైజాగ్‌లో వైసీపీ వాళ్లు భూములు కొన్నట్లు తెలుస్తోంది

తుగ్లక్ చర్యలతో..రాష్ట్రం నష్టపోతోంది

మూడు ప్రాంతాల్లో రాజధాని పెడతారా..?

సీఎం అమరావతిలో ఉంటాడా..? వైజాగ్‌లో ఉంటాడా..? కర్నూలులో ఉంటాడా..?

కావాలనే ఒక సామాజికవర్గంపై బురద జల్లుతున్నారు

రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని వైసీపీ మరింత  నాశనం చేయబోతుంది

జగన్ హైదరాబాద్, బెంగుళూరుల్లో ఆస్తుల విలువ పెరగడానికే ఈ చర్యలన్నీ..!

ఈయన కంటే తుగ్లక్ కాస్త బెటర్ అనిపిస్తోంది

మన దేశంలోనే లేని విధానాలు ఈయన అమలు చేస్తున్నాడు. ఏంటి ఈ తిక్క పనులు..?

టీడీపీలో ఎవరీకి బినామీలు ఉండరు. మీకున్నారు కాబట్టే జైలుకు వెళ్లారు

పద్దతిలేని, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు

పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా రాజధాని తయారయ్యింది

కమిటి నిర్ణయం రాకముందే ఈ ప్రకటనలేంటి..? మమల్ని బఫూన్ అన్నాడు. ఇప్పుడు అర్థమవుతోంది ఎవరు బఫూనో..?

ఉన్మాది అంటే ఏంటో..? ఈయన నిరూపిస్తున్నాడు

వారి కార్యకర్తలు 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చుకున్నాడు

రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడి పెట్టడానికి రావడం లేదు