కేజీఎఫ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా ఇక లేనట్లేనా..!

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ సినిమా 2018లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో మెప్పించిన ఈ మూవీతో హీరో, దర్శకుడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించడంలో ప్రశాంత్‌కు సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న ఈయన త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా […]

కేజీఎఫ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా ఇక లేనట్లేనా..!
Follow us

|

Updated on: May 22, 2020 | 11:05 PM

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ సినిమా 2018లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో మెప్పించిన ఈ మూవీతో హీరో, దర్శకుడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించడంలో ప్రశాంత్‌కు సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న ఈయన త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ విషయంపై ప్రశాంత్ నీల్ కన్నడ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎడురుకున్నారు. ఒకప్పుడు ఆయన్ని పొగిడిన వాళ్ళే.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు తమ ఇండస్ట్రీ హీరోలతోనే సినిమాలు తీసి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారని.. కానీ ప్రశాంత్ డబ్బుల కోసం వేరే ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు తీస్తున్నారని కన్నడ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు.

ఇక దీనిపై ప్రశాంత్ నీల్ రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తనకు ఇంత పేరు వచ్చిందంటే.. దానికి కారణం కన్నడ ఇండస్ట్రీ అని.. ప్రస్తుతం తాను తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పలేనని.. ఫోకస్ అంతా కేజీఎఫ్ 2 పైనే ఉందని స్పష్టం చేశారు. దీనితో ఆ వార్తలు రూమర్లు గానే మిగిలిపోయే ఛాన్సులు కనిపిస్తున్నాయి.