వికారాబాద్ దీపిక కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్.!

|

Sep 29, 2020 | 4:13 PM

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. దీపిక ఇష్టపూర్వకంగానే అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నామని వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ9 తో చెప్పారు. కిడ్నప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నామని ఆయన చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన సీఐ.. దీపిక కుటుంబసభ్యులు అఖిల్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఐ విట్నెస్ […]

వికారాబాద్ దీపిక కిడ్నాప్ లో కొత్త ట్విస్ట్.!
Follow us on

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. దీపిక ఇష్టపూర్వకంగానే అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నామని వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ9 తో చెప్పారు. కిడ్నప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నామని ఆయన చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన సీఐ.. దీపిక కుటుంబసభ్యులు అఖిల్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఐ విట్నెస్ లు మాత్రం బలవంతంగా దీపికను లాకెళ్లినట్టు చెబుతున్నారని.. దీంతో అఖిల్ ఫ్రెండ్స్ ను అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. త్వరలో నే దీపిక ఆచూకి ని ట్రేసౌట్ చేస్తామని చెప్పారు.

ఇలా ఉండగా, వికారాబాద్ కు చెందిన ఖలీల్ అలియాస్ అఖిల్ – దీపిక ప్రేమించుకున్నారు. 2016లో ఆర్యసమాజ్ లో వివాహాం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దీపిక – అఖిల్ కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే లవ్ మ్యారేజ్ పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో దీపికను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. వీరి విడాకులకుకి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం దీపిక–అఖిల్ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం అక్కతో కలిసి దీపిక షాపింగ్ వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకోబోతే తనను తోసేశారని దీపిక సోదరి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ బిడ్డ ఆచూకీ త్వరగా కనుగోవాలని దీపిక కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.