సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం, ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మోదీ ప్రమాణ స్వీకారం ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు రాష్త్రపతి భవన్లో జరుగనుంది.
ప్రధానిమోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను భారీగా ఆహ్వానించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ దక్షిణాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులను ఆహ్వానించారు. అయితే ఈసారి ఆగ్నేయాసియాతో పాటు పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు పీఎంవో వర్గాలు భావిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో పాటు, జపాన్ ప్రధాని షింజో అబే, అబుదాబీ యువరాజు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వంటివారిని ఆహ్వానించే అవకాశం ఉంది.
Narendra Modi to take oath as PM on 30th May at 7pm, at Rashtrapati Bhavan. Members of Union Council of Ministers to also take oath. pic.twitter.com/qC2kTE35fE
— ANI (@ANI) May 26, 2019