Breaking: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

|

Aug 16, 2020 | 12:59 AM

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా వెల్లడించాడు.

Breaking: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..
Follow us on

MS Dhoni announces retirement: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా వెల్లడించాడు. ఇన్నేళ్ళుగా తనకు మద్దతు పలికిన అభిమానులకు ధోని ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ లో ధోని ఆడాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. పోస్టులో ఫార్మాట్ ఏదీ కూడా ప్రస్తావించకపోవడంతో ధోని యూఏఈలో జరిగే ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ధోని ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం చెన్నైలో ఉన్నాడు.