హుస్సేన్‌సాగర్‌ చుట్టూ చుక్ చుక్ రైలు

|

Oct 08, 2020 | 5:40 AM

హైదరాబాద్‌ మహానగర కీర్తికిరీటంలో మరో మణిహారం వచ్చి చేరబోతోంది. సాగర హారంకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకునే హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. నూతన టూరిజం ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్‌లను అనుభవం ఉన్న కన్సల్టెంట్‌ల ద్వారా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా […]

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ చుక్ చుక్ రైలు
Follow us on

హైదరాబాద్‌ మహానగర కీర్తికిరీటంలో మరో మణిహారం వచ్చి చేరబోతోంది. సాగర హారంకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకునే హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు.

నూతన టూరిజం ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్‌లను అనుభవం ఉన్న కన్సల్టెంట్‌ల ద్వారా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కొత్తగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్‌లు రూపొందించిన ప్రాజెక్టుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లను మంత్రి పరిశీలించారు. ప్రముఖ సంస్థలతో చర్చించి దుర్గంచెరువుతోపాటు కాళేశ్వరం, మిడ్‌ మానేరు, కొండపోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.

సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, పర్యాటకశాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.