వారి మృతి నన్ను కలిచివేసింది…

|

Sep 02, 2020 | 12:53 PM

పవన్ కల్యాణ్ అభిమానుల మ‌ృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. చిత్తూర్‌లో పవన్ బ‌ర్త్‌డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి...

వారి మృతి నన్ను కలిచివేసింది...
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడపల్లి పంచాయతీలోని పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు బుధవారం పవన్‌ జన్మదిన కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జాతీయ రహదారి పక్కన బ్యానర్లు కట్టారు. ఈ సందర్భంగా ఓ 30 అడుగుల ఫ్లెక్సీ విద్యుత్‌ తీగల మీద పడి కడపల్లికి చెందిన రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌కీల్ సాబ్ టీం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. చిత్తూర్‌లో పవన్ బ‌ర్త్‌డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అంటూ చిరు త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.