జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై తన్ని అబార్షన్..

స్పేస్ లో అద్బుతాలు క్రియేట్ చేసే స్థాయికి ఎదిగాం. అయినా కూడా మూఢనమ్మకాలను వ‌ద‌ల‌డం లేదు కొంద‌రు ప్ర‌బుద్దులు. రెండో బిడ్డ పుడితే తండ్రి ప్రాణాల‌కు ముప్ప‌ని జ్యోతిష్యుడు చెప్పాడంతో..ఓ కసాయి భర్త గర్భిణి భార్యపై దారుణానికి తెగ‌బ‌డ్డాడు. నిండు గర్భిణి అయిన భార్య కడుపుమీద కాలితో తన్నడంతో..ఆమెకు గర్భస్రావం అయింది. లోకం చూడ‌ని ప‌సికందు మ‌ర‌ణానికి కారణమైన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అమ్మపేట పరిధిలోని ములియానూర్‌కి చెందిన మునుస్వామి(32) […]

జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై తన్ని అబార్షన్..
Pregnant Woman
Follow us

|

Updated on: May 27, 2020 | 6:52 PM

స్పేస్ లో అద్బుతాలు క్రియేట్ చేసే స్థాయికి ఎదిగాం. అయినా కూడా మూఢనమ్మకాలను వ‌ద‌ల‌డం లేదు కొంద‌రు ప్ర‌బుద్దులు. రెండో బిడ్డ పుడితే తండ్రి ప్రాణాల‌కు ముప్ప‌ని జ్యోతిష్యుడు చెప్పాడంతో..ఓ కసాయి భర్త గర్భిణి భార్యపై దారుణానికి తెగ‌బ‌డ్డాడు. నిండు గర్భిణి అయిన భార్య కడుపుమీద కాలితో తన్నడంతో..ఆమెకు గర్భస్రావం అయింది. లోకం చూడ‌ని ప‌సికందు మ‌ర‌ణానికి కారణమైన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

అమ్మపేట పరిధిలోని ములియానూర్‌కి చెందిన మునుస్వామి(32) భ‌వ‌న నిర్మాణ కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడు. అత‌డి భార్య‌ రమ్య(25) ఇంట్లోనే ఉంటుంది. వీరిద్ద‌రికి సుమారు ఆరేళ్ల కిందట వివాహాం జ‌రిగింది. మొద‌టి కాన్పులో ఒక బాబు పుట్టాడు. తాజాగా రెండోసారి రమ్య గర్భం దాల్చింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల త‌న‌కు తెలిసిన‌ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లిన మునుస్వామి తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. అయితే రెండో బిడ్డ పుడితే తండ్రి చ‌నిపోతాడ‌ని జ్యోతిష్యుడు చెప్పడంతో అత‌డు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యాడు. అబార్షన్ చేయించుకోవాలని భార్యను ఒత్తిడి చేయ‌గా.. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేప‌థ్యంలో ఈనెల‌ 18 వ తేదీ మద్యం మ‌త్తులో ఇంటికి వచ్చిన మునిస్వామి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె కడుపుపై కాలితో తన్నాడు. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన రమ్యని స్థానికులు ర‌క్షించి ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారు. పుట్టింటికి వెళ్లిన తర్వాత కూడా ఆమెకు కడుపునొప్పి తీవ్ర‌మైంది. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రమ్యకి గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు. త‌న చిన్నారి ఇక‌లేద‌ని తెలుసుకున్న ఆ మ‌హిళ‌..అందుకు కార‌ణ‌మైన త‌న భ‌ర్త‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Latest Articles
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్రలుః సీఎం జగన్
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
ఇది అందం కాదు.. అద్భుతం.! దివ్య భారతి వయ్యారానికి యువత ఫిదా..
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుమ్రా కుమారుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో! ఫొటోస్ వైరల్
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
బుల్లితెర నటికి వేధింపులు.. అసభ్యకర సందేశాలు..
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!