Bhopal: భోపాల్లో కలకలం.. దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతుండగా భక్తులపైకి దూసుకొచ్చిన కారు
మధ్యప్రదేశ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. భోపాల్లో దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతుండగా.. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకొచ్చింది. బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో..
Madya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. భోపాల్లో దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతుండగా.. ఒక్కసారిగా భక్తులపైకి దూసుకొచ్చింది. బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భక్తులంతా కారుపైకి దూసుకురావడంతో భయంతో కారును రివర్స్ తీసుకొని పరారయ్యాడు డ్రైవర్.
కాగా, మూడురోజుల క్రితం ఇదే తరహా దారుణం చత్తీస్ఘడ్లో జరిగిన సంగతి తెలిసిందే. జష్పూర్లో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులపై ఓ కారు దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తరువాత ఆగ్రహం చెందిన భక్తులు ఆ కారును తగులబెట్టారు.
గ్రామస్థులు దసరా పండుగ సంధర్భంగా అంతా కలిసి ఊరేగింపుగా తరలివెళుతున్న సమయంలో ఒక ఎస్యూవీ వాహనం ఒక్కసారిగా వెనక నుండి దూసుకురావడంతో ఈ దారుణం జరిగింది. అయితే ఆ వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంలో భారీ ఎత్తున గంజాయి ఉండటంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో తప్పించుకునే క్రమంలో వాహనాన్ని వేగంగా నడిపిన కారు డ్రైవర్ ఊరేగింపుపైకి కారుతో దూసుకెళ్లాడని చెబుతున్నారు.
ఉత్సవ ఊరేగింపులో పాల్గొంటోన్న దాదాపుగా 24 మంది భక్తుల్ని సదరు వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఇక ఊరేగింపును వీడియో తీస్తుండగా యాక్సిడెంట్ కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
#WATCH Two people were injured after a car rammed into people during Durga idol immersion procession in Bhopal’s Bajaria police station area yesterday. Police said the car driver will be nabbed.#MadhyaPradesh pic.twitter.com/rEOBSbrkGW
— ANI (@ANI) October 17, 2021
Read also: Balakrishna: ఇవాళ సీమలో ఇంట్రెస్టింగ్ మీటింగ్.. హాజరుకాబోతోన్న హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ