స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల వల్ల యువతకు లాభం: జూపల్లి రామేశ్వరరావు
టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్పల్లిలోని అమ్మక్కపేట వైఎస్ఆర్ కాలనీలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువత చాలా పెద్ద సంఖ్యలో ఉందని.. అది మనదేశానికి ఒక […]
టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్పల్లిలోని అమ్మక్కపేట వైఎస్ఆర్ కాలనీలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువత చాలా పెద్ద సంఖ్యలో ఉందని.. అది మనదేశానికి ఒక గొప్ప ప్రయోజనమని అన్నారు. గ్రామస్థాయిల్లో ఇలాంటి సెంటర్లు పెట్టి, ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన అన్నారు.