కాకినాడలో జనసేన గర్జన.. దీక్షకు పవన్ రెడీ

రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ దీక్షలో పాల్గొంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.. దానికి అనుగుణంగా దీక్ష సభా […]

కాకినాడలో జనసేన గర్జన.. దీక్షకు పవన్ రెడీ
Follow us

|

Updated on: Dec 11, 2019 | 6:42 PM

రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ దీక్షలో పాల్గొంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.. దానికి అనుగుణంగా దీక్ష సభా స్థలం ఏర్పాట్లు చేసారు.

ఖరీఫ్ సీజన్‌కు గాను గత ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో 312 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 96 వేల 464 మంది రైతుల నుంచి సుమారు 11 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అందుకు గాను రైతులకు 1979 కోట్ల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. అప్పట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వానికి 15 నుండి 30 రోజుల సమయం పట్టేది. ఈ నేపధ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ దృష్టికి ఈ సమస్యను రైతులు తీసుకెళ్ళారు. దీంతో తాము అధికారంలోనికి వస్తే ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించడంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సకాలంలో డబ్బులు అందుతాయని రైతులు ఆశించారు.

అక్టోబరులో కొనుగోలు చేసిన ధాన్యానికి డిసెంబర్ 4వ తేదీ వరకు చెల్లింపులు జరపలేదు. ధాన్యం ప్రభుత్వానికి అప్పజెప్పి 45 రోజులు దాటడం, దీనికి తోడు రబీ సీజన్‌కు నాట్లు వేయడానికి పెట్టుబడి కూడా చేతిలో లేకపోవడంతో కొంతమంది రైతులు తమ సమస్యను స్థానిక జనసేన నాయకుల ద్వారా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారు. ఉభయగోదావరి జిల్లాలో ఉండే అగ్రవర్ణ రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం, 45 రోజులు దాటుతున్నా ధాన్యం సొమ్ము చెల్లించకపోవడంతో పాటు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించినా కేవలం లక్షా 55 వేల 385 మెట్రిక్ టన్నులు మాత్రమే అధికారులు లెక్కలు చూపించడంపై కొంతమంది రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తూ రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారు.

రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి పొలాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతు భరోసా విషయంలో అగ్రవర్ణ రైతులకు జరుగుతున్న అన్యాయం, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల అవకతవకలు, చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం మండపేటలో నిర్వహించిన రైతు సదస్సులో రైతుల సమస్యపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వానికి మూడు రోజుల డెడ్ లైన్ విధించారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన మూడు రోజుల్లో రైతుల సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో కాకినాడ వేదికగా నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు.. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం కాకినాడ వేదికగా నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రైతులతో మాట్లాడి వారి సమస్యలపై మరింత లోతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.. దీంతో రైతు సౌభాగ్య దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లా జనసేన నాయకులు కసరత్తు చేస్తున్నారు..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో