ఐరాస మండలిలో భారత సభ్యత్వం.. ఆస్ట్రేలియా మద్దతు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని ఈ దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.’ ఈ అర్హతకు సంబంధించి ఇండియా ‘ ఆత్మపరిశీలన ‘ చేసుకుంది .. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ వాయిస్ వినిపించాలంటే అందుకు భద్రతామండలే తగిన వేదిక అని మోదీ భావించారు ‘ […]

ఐరాస మండలిలో భారత సభ్యత్వం.. ఆస్ట్రేలియా మద్దతు
Follow us

|

Updated on: Nov 19, 2019 | 3:04 PM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని ఈ దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.’ ఈ అర్హతకు సంబంధించి ఇండియా ‘ ఆత్మపరిశీలన ‘ చేసుకుంది .. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ వాయిస్ వినిపించాలంటే అందుకు భద్రతామండలే తగిన వేదిక అని మోదీ భావించారు ‘ అని ఎబోట్ పేర్కొన్నారు. ఈ దేశ సైనిక, ఆర్ధిక బలాబలాలను బట్టి చూస్తే ఈ అభిమతం పూర్తి సమంజసమైనదన్నారు. ఈ అంశంపై తమ దేశ ప్రభుత్వం ఎలాంటి వైఖరి పాటిస్తోందో తనకు తెలియకపోయినా.. తాను మాత్రం వ్యక్తిగతంగా దీనిని పూర్తిగా సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ ఈ వరల్డ్ కు ఒక్క సూపర్ పవర్ దేశమే కాదు.. రెండు డెమోక్రటిక్ సూపర్ పవర్స్ అవసరం కూడా ఉంది ‘ అని టోనీ ఎబోట్ వ్యాఖ్యానించారు. అంటే.. ఇండియాను అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ఆయన పరోక్షంగా అభివర్ణించారు.ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ లో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇండియా ఏనాటినుంచో కోరుతోంది. ఇందుకు ప్రపంచ దేశాల మద్దతును కోరుతోంది.