ఈ దంపతుల జీతాలు ఎంతో తెలుసా..!

|

Aug 26, 2020 | 7:23 PM

మన దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వాళ్లుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, కావేరి కళానిధి ఘనత సాధించారు. గతేడాది ఈ జంట అక్షరాలా రూ.175 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నట్టు..

ఈ దంపతుల జీతాలు ఎంతో తెలుసా..!
Follow us on

మన దేశంలో అత్యధిక జీతం అందుకుంటున్న వాళ్లుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, కావేరి కళానిధి ఘనత సాధించారు. గతేడాది ఈ జంట అక్షరాలా రూ.175 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నట్టు కంపెనీ లెక్కలు చెబుతున్నాయి. వీళ్లిద్దరూ ఏటా చెరో రూ.13.87 కోట్ల జీతం, రూ.73.63 కోట్ల ఎక్స్ గ్రేషియోగా పొందుతున్నారు. మొత్తంగా ఏటా ఒక్కొక్కరూ రూ.87.50 కోట్ల చొప్పున శాలరీ అందుకున్నారు. వీరి తర్వాత సన్ టీవీలో మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. రమేష్ కుమార్ అత్యధిక వేతనం అందుకుంటున్నారు. ఆయన గత ఏడాది 1.78 కోట్ల జీతం తీసుకున్నారు. ఆ తర్వాత కళానిధి మారన్ కూతురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య కళానిధి మారన్ రూ.1.22 కోట్ల జీతం అందుకున్నారు.

గత ఏడాది సన్ టీవీకి రూ.3,653 కోట్ల ఆదాయం రాగా, 1,797 కోట్ల రూపాయలమేర లాభాలను గడించింది. ఇదిలాఉంటే, భారతదేశంలో అత్యంత ధనవంతుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వేతనాన్ని కొన్నేళ్లుగా 15కోట్లు గానే కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కారణంగా ముఖేష్ తాను వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.