
మైల్డ్ (స్వల్ప) నుంచి మోడరేట్ (సాధారణ) స్థాయి వరకు కోవిడ్-19 లక్షణాలు గల రోగుల చికిత్స కోసమంటూ హెటెరో కంపెనీ తన ‘ఫెవిపిరమిర్’ మందును బుధవారం లాంచ్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ పేరును ‘ఫెవివిర్’ గా మార్చామని, ఒక్కో టాబ్లెట్ ధర 59 రూపాయలేనని ప్రకటించింది. ఈ జెనెరిక్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ను దేశంలోని సాధారణ కోవిడ్ రోగులు వాడవచ్ఛునని స్పష్టం చేసింది. లోగడ పేర్కొన్న ఫెవిపిరమిర్ మెడిసిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతిని పొందినట్టు గుర్తు చేసింది.
కోవిడ్-19 చికిత్సలో వినియోగించే కోవిఫర్ ని డెవలప్ చేసిన అనంతరం రెండో బ్రాండ్ గా ఫెవివిర్ ను ఉత్పత్తి చేశామని, దీన్ని హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని రీటెయిల్ మెడికల్ షాపులు, హాస్పిటల్ ఫార్మసీలలో ఈ మందు లభ్యమవుతుందని ఈ వర్గాలు వివరించాయి. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని పేర్కొన్నాయి.