గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక..

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరగనున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక..

Updated on: Sep 13, 2020 | 1:22 PM

Grama Sachivalayam Exams: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరగనున్నాయి. దీని సంబంధించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే అభ్యర్థుల కోసం ఈసారి ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ వివరాలను అందుబాటులో ఉంచారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. కాగా, గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us