ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: పోచారం

ప్రజా శ్రేయస్సు కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోచారం.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే సర్కార్‌ సంకల్పం అన్నారు. మానవ జన్మకు తోడు, నీడ తప్పనిసరి అన్న ఆయన.. రూ. 2 కోట్ల 80 లక్షలతో 40 డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన చిరకాల స్వప్పమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకూడదనే సంకల్పంతో […]

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: పోచారం

Updated on: Aug 17, 2019 | 4:30 PM

ప్రజా శ్రేయస్సు కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోచారం.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే సర్కార్‌ సంకల్పం అన్నారు. మానవ జన్మకు తోడు, నీడ తప్పనిసరి అన్న ఆయన.. రూ. 2 కోట్ల 80 లక్షలతో 40 డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన చిరకాల స్వప్పమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకూడదనే సంకల్పంతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తామని పోచారాం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
Loading...
Unable to load recommendations.
Follow Us