గుడ్‌న్యూస్.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ షురూ.. భారత్ మరో ముందడుగు..

| Edited By:

May 12, 2020 | 5:43 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిద్-19 చికిత్సలో సత్ఫలితాస్తుందని భావిస్తున్న

గుడ్‌న్యూస్.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ షురూ.. భారత్ మరో ముందడుగు..
Follow us on

Antiviral drug Favipiravir: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిద్-19 చికిత్సలో సత్ఫలితాస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం ‘ఫవిపిరవిర్‌’ (Favipiravir) క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో కీలక దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్‌-19 రోగులపై పరీక్షించనున్నట్లు ‘గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌’ వెల్లడించింది.

వివరాల్లోకెళితే.. ఈ డ్రగ్‌ను పరీక్షించేందుకు గత నెల ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా'(డీసీజీఐ) సంస్థకు అనుమతులిచ్చింది. ‘ఫవిపిరవిర్‌’ కొవిడ్‌-19ను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో భారత్‌లో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని గ్లెన్‌మార్క్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం పది సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయని గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది.

కాగా.. జులై లేదా ఆగస్టు నాటికి ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రోగుల చికిత్సకు 14 రోజులు, అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుందని తెలిపింది. ఈ డ్రగ్‌ తయారీకి కావాల్సిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌(ఏపీఐ), సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కొవిడ్‌-19 చికిత్సలో ముందడుగు పడినట్లేనని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్‌ తెలిపారు.

అయితే.. జపాన్‌లో ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఫవిపిరవిర్‌ను కనుగొన్నారు. కొవిడ్‌-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఈ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. జపాన్‌కు చెందిన టొయామా కెమికల్‌ అనే కంపెనీకి చెందిన ‘అవిగన్‌’ అనే బ్రాండుకు ఫవిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం.