GHMC Elections Results 2020: తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు …పోస్టల్‌ బ్యాలెట్‌లో రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌..40శాతం వరకు చెల్లని ఓట్లు

|

Dec 04, 2020 | 10:23 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో..

GHMC Elections Results 2020: తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ...పోస్టల్‌ బ్యాలెట్‌లో రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌..40శాతం వరకు చెల్లని ఓట్లు
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో కనిపిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో మెజార్టీ డివిజన్లు బీజేపీకే దక్కినట్లు తెలుస్తోంది. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1,926 కాగా, పోస్టల్‌ బ్యాలెట్లలో దాదాపుగా 40శాతం వరకు చెల్లని ఓట్లు పడ్డట్లుగా తెలుస్తోంది.