ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. ఈసారి ఉపాధి ఆధారిత కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను పెంచారు. గతేడాది 169 కళాశాలల్లో 88,169 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి ఇచ్చిన అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈసారి అన్ని కాలేజీల వృత్తివిద్యా కోర్సులకు కొత్తగా 27,592 సీట్లు కేటాయించింది. ఇందులో దాదాపు 20వేలకు పైగా సీట్లు ఇంజనీరింగ్ కోర్సులవే కావడం విశేషం. 2015-16 తర్వాత రాష్ట్రంలో లక్ష సీట్లు దాటడం ఇదే ప్రథమం.
తెలంగాణలోని ప్రొఫెషనల్ కాలేజీల్లో అదనంగా 27,592 సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఏఐసీటీఈ శుక్రవారం రాష్ట్రాలవారీగా మంజూరుచేసిన సీట్ల వివరాలను ప్రకటించింది. కొత్తగా మంజూరైన సీట్లలో ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులైన డేటా సైన్స్, ఏఐ, ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ లాంటివి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కళాశాలలు ఈసారి మూతపడ్డాయి. గతంలో పెద్దగా డిమాండ్ లేనివి, ఎక్కువగా విద్యార్థులు ఆసక్తి చూపించని కాలేజీల్లో 2,689 సీట్లకు అనుమతులు రద్దుచేశారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 2 కళాశాలలకు అనుమతులు మంజూరు చేశారు.
Read More:
కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్ సెంటర్
మొబైల్ ఫోన్కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ