దేశంలో కరోనా.. ఒక్క రోజులో 64,399 కేసులు, 861 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,399 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 861 మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా.. ఒక్క రోజులో 64,399 కేసులు, 861 మరణాలు

Updated on: Aug 09, 2020 | 11:30 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,399 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 861 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,011కి చేరుకుంది. ఇందులో 6,28,747 యాక్టివ్ కేసులు ఉండగా.. 43,379 మంది కరోనాతో మరణించారు. అటు గడిచిన 24 గంటల్లో  53,879 మంది డిశ్చార్జ్ కావడంతో.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 14,80,885 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే దేశంలో వరుసగా మూడో రోజు 60,000 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. అటు కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 68.78 శాతం ఉండగా.. మరణాల రేటు 2.01 శాతంగా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us