Corona India: దేశంలో కరోనా విలయం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరుకుంది.

Corona India: దేశంలో కరోనా విలయం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

Updated on: Jul 12, 2020 | 10:06 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరుకుంది. ఇందులో 2,92,258 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,674 మంది కరోనాతో మరణించారు. అటు 5,34,621 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుతో సహా 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లిస్టులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో 2,46,600 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,116 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,10,921 కేసులు, 3334 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 1,34,226 కేసులు నమోదు కాగా, 1898 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us