సుడాన్‌లో చెలరేగిన ఘర్షణలు.. 127 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పౌరులకు, సైనికులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 127 మంది మరణించారు. సూడాన్‌లోని టోంజ్ నగరంలో ఈ ఘటన..

సుడాన్‌లో చెలరేగిన ఘర్షణలు.. 127 మంది మృతి

Updated on: Aug 13, 2020 | 10:25 PM

దక్షిణ సూడాన్‌లో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పౌరులకు, సైనికులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 127 మంది మరణించారు. సూడాన్‌లోని టోంజ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పౌరుల నుంచి ఆయుధాలను తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో.. శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ లుల్ రువై కోయాంగ్ బుధవారం నాడు ఈ విషయాన్ని తెలిపారు.

గత కొన్నేళ్లుగా.. సూడాన్‌ ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే పలు సంఘాలు వారి సెక్యూరిటీ కోసం ఆయుధాలను అందజేశాయి. అయితే ఆయుధాలతో అక్కడి యువత ఆపరేషన్‌ చేపట్టడాన్ని తోంజ్‌ సైన్యం ఒప్పకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని ఆర్మీ అధికారి తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us