
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఇందు కోసం మోదీ సర్కారు ఢిల్లీ లోని వసంత్ విహార్ లో 1110 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. టీఆర్ఎస్ పార్టీ ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. దీంతో రాబోయే కొన్ని రోజుల్లోనే హస్తిన గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడబోతోందన్న మాట.