వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. బీజేపీ కార్యకర్తని కాల్చి చంపిన దుండగులు

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పారాగణ జిల్లాలో.. బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన బీజేపీ కార్యకర్తను చందన్ షాగా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్త హత్యకు గురైన భటపారాలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చందన్ షా హత్యపై కేసు నమోదు […]

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. బీజేపీ కార్యకర్తని కాల్చి చంపిన దుండగులు
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 3:34 PM

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పారాగణ జిల్లాలో.. బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన బీజేపీ కార్యకర్తను చందన్ షాగా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్త హత్యకు గురైన భటపారాలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చందన్ షా హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.