చైనాపై మీరు చేసిన నిర్వాకమేమిటి ? ఆ దేశానికి మీరు లొంగిపోలేదా ? రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 4:18 PM

అరుణాచల్ ప్రదేశ్ లో భారత భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుంటూ చైనా గ్రామాన్ని నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడడం..

చైనాపై మీరు చేసిన నిర్వాకమేమిటి ? ఆ దేశానికి మీరు లొంగిపోలేదా ? రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం
Follow us on

అరుణాచల్ ప్రదేశ్ లో భారత భూభాగాన్ని కొంతమేర ఆక్రమించుకుంటూ చైనా గ్రామాన్ని నిర్మించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడడం మీద బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. మీరు అన్నీ అబధ్ధాలే చెబుతున్నారని, నెలరోజుల విదేశీ వెకేషన్ తరువాత తిరిగి వఛ్చి ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. నాడు పండిట్ నెహ్రూ ఇప్పుడు మీరు చెబుతున్న అరుణాచల్ లోని భూమితో సహా వేలాది ఎకరాల భూమిని చైనాకు ధారాదత్తం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. మీ హయాంలో డ్రాగన్ కంట్రీకి మీరు ఎన్నిసార్లు లొంగిపోలేదు ? ఆ దేశానికి అనుకూల విధానాలు పాటించలేదా అన్నారు.. ఇక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతులపట్ల జాలి, కరుణ కలుగుతాయా, మీ కాంగ్రెస్ హయాంలో మీరు సరైన చర్యలు తీసుకుని ఉంటే అన్నదాతలు నేడు ఇంత దయనీయ స్థితిలో ఉండేవారు కారని నడ్డా పేర్కొన్నారు. వారి మేలు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటే విమర్శిస్తారా అన్నారు. కరోనా వైరస్ పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బంది ఇంతగా కృషి చేసి..ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి  దేశం కోలుకుంటుంటే ప్రభుత్వాన్ని, వైద్య సిబ్బందిని, హెల్త్ కేర్ వర్కర్లను, ఈ దేశంలోని 130 కోట్లమందిని అభిందించాలన్న యోచన కూడా మీకు లేకపోయిదన్నారు.