49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..?

దేశంలో మూకదాడులను అరికట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన దాదాపు 49 మంది సెలబ్రిటీలు, మేధావులు, రచయితలపై రాజద్రోహం కేసు క్లోజయింది. ఈ మేరకు బీహార్ పోలీసులకు ఆదేశాలు అందాయి. మణిరత్నం, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కశ్యప్, రామచంద్ర గుహ సహా ఈ నలభై తొమ్మిదిమందీ మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరి లేఖకు మద్దతు తెలుపుతూ బాలీవుడ్ కు చెందిన 180 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా మరో బహిరంగ లేఖను విడుదల […]

49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 10, 2019 | 4:21 PM

దేశంలో మూకదాడులను అరికట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన దాదాపు 49 మంది సెలబ్రిటీలు, మేధావులు, రచయితలపై రాజద్రోహం కేసు క్లోజయింది. ఈ మేరకు బీహార్ పోలీసులకు ఆదేశాలు అందాయి. మణిరత్నం, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కశ్యప్, రామచంద్ర గుహ సహా ఈ నలభై తొమ్మిదిమందీ మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరి లేఖకు మద్దతు తెలుపుతూ బాలీవుడ్ కు చెందిన 180 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. నసీరుద్దీన్ షా, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి, రొమిలా థాపర్ వంటి వారంతా ఈ లిస్టులో ఉన్నారు. దేశంలో జరుగుతున్న మూకదాడులను అరికట్టే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాయడంలో తప్పేం ఉందని వీరు ప్రశ్నించారు. ‘ మా నోళ్లు నొక్కకండి ‘ అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు కూడా వీరిని సమర్థించాయి. దేశంలో ఇదో పెద్ద సంచలనమైంది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ 49 మందిపై కేసు మూసివేయాలని తమకు ఆదేశాలు అందినట్టు ముజఫర్ పూర్ పోలీసులు తెలిపారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మొదట కేసు నమోదయింది. కానీ తాజాగా ఇది ఉన్నత స్థాయి రాజకీయరంగు సంతరించుకోవడంతో.. ‘ ఎందుకొచ్చిన గొడవ ‘ అనుకుంటూ ‘ కథ క్లోజయ్యింది. అసలు ఈ వ్యవహారంలో వీరిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు రిజిస్టర్ కావడం విశేషం. సుధీర్ కుమార్ ఓఝా అనే ఈ ఫిర్యాదుదారుడు లాయర్ కూడా. సెలబ్రిటీల లేఖకు సంబంధించి ఆయన ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లను గానీ, సాక్ష్యాధారాలను గానీ చూపలేకపోయారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అసలు ఈ మేధావులు రాసినట్టు చెబుతున్న లేఖలోని సంతకాలు వారివేనా అన్న విషయాన్ని కూడా ఓఝా నిరూపించలేకపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదుదారుడు ఇలా చేశాడని అర్థమవుతోందన్నారు.

ఐపీసీలోని 182, 211 సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. (గత జులై 23 న ఓఝా తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు). దాంతో సదర్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. ఈ వ్యవహారంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకోవాలని ఆయన మాజీ సహచరుడు, ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ ఇటీవలే ఆయనను కోరారు. నిజానికి నిందితుల్లో ఒకరిగా పోలీసులు పేర్కొంటున్న మేధావి రామచంద్ర గుహ.. ఒకప్పుడు మీ నాయకత్వాన్ని ప్రశంసించిన వారే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కూడా అయినా సుశీల్ కుమార్ మోడీ ఇరకాటంలో పడ్డారు.

ఈ కేసుతో తమ పార్టీకి గానీ, సంఘ్ పరివార్ తో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. పైగా-సెలబ్రిటీలపై తప్పుడు కేసు పెట్టిన ఓఝా కు ఇలాంటి అలవాటు ఎప్పటినుంచో ఉందని.. కొన్నేళ్లుగా ఈ విధమైన కేసులు వేస్తున్నాడని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. కానీ..ఓఝా మాత్రం నిబ్బరంగా ఉండడమే విశేషం. తన ఫిర్యాదు ఆధారంగా ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయని, గతంలో కూడా పదేళ్లుగా ఇలాంటివి కోర్టుల్లో పెండింగులో ఉంటూ వచ్చాయని ఆయన చెప్పాడు. అసలు ఇప్పుడు నేను పోలీసులపైనే కేసు వేస్తా అంటూ ఓఝా కౌంటరివ్వడం కొసమెరుపు.

Latest Articles
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..