బిగ్ బాస్ ఇంట్లో.. సైక్లింగ్ టాస్క్ చిచ్చు..

| Edited By:

Jul 31, 2019 | 10:46 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 10లో.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు సైకిల్ తొక్కే పనిలో పడ్డారు. ఇంట్లో నీళ్లు, గ్యాస్ ఇతర అవసరాలు కావాలంటే ఈ టాస్క్‌ని పూర్తి చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. అవసరానికి మించి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంటి సభ్యులకు చూపించాడు. నీళ్లు రావాలన్నా, గ్యాస్ కావాలన్నా.. మళ్లీ బిగ్ బాస్ చెప్పేవరకూ రాత్రి, పగలు సైకిల్ తొక్కుతూనే ఉండాలని.. లేకపోతే రాత్రంతా ఇంట్లో లైట్లు వెలుగుతూనే […]

బిగ్ బాస్ ఇంట్లో.. సైక్లింగ్ టాస్క్ చిచ్చు..
Follow us on

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 10లో.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు సైకిల్ తొక్కే పనిలో పడ్డారు. ఇంట్లో నీళ్లు, గ్యాస్ ఇతర అవసరాలు కావాలంటే ఈ టాస్క్‌ని పూర్తి చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. అవసరానికి మించి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంటి సభ్యులకు చూపించాడు. నీళ్లు రావాలన్నా, గ్యాస్ కావాలన్నా.. మళ్లీ బిగ్ బాస్ చెప్పేవరకూ రాత్రి, పగలు సైకిల్ తొక్కుతూనే ఉండాలని.. లేకపోతే రాత్రంతా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయని తెలిపాడు. ఇక టాస్క్‌లో అందరూ పార్టిసిపేట్ చేయాలని శివజ్యోతి చెప్పడం, రవికృష్ణ ఏదో అన్నాడని తమన్నా అలగడం, జాఫర్‌, మహేష్‌, బాబా భాస్కర్‌, తమన్నాలు కలిసి శ్రీముఖి గురించి మాట్లాడుకోవడం, వితికా-పునర్నవి మధ్య చిన్న వివాదం చెలరేగడం ఈ ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి.

అయితే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ కోసం సైకిల్‌ని మేం తొక్కుతామంటే మేం తొక్కుతామ‌ని ఇంటి సభ్యులు పోటీ ప‌డ్డారు. ముందుగా శ్రీముఖితో పాటు బాబా భాస్కర్, ర‌వికృష్ణ‌ సైకిల్ తొక్క‌డం మొద‌లు పెట్టారు. ఇంత‌లో త‌మ‌న్నా నేను ఇప్పుడు తొక్కి నైట్ ప‌డుకుంటాన‌ని అంది. ఈ విషయంలో శివజ్యోతికి, తమ్మన్నాకి కాస్త చర్చ జరిగింది. ఇక అక్కడ గ్యాస్‌కు సంబంధించిన సైకిల్‌ను పునర్నవి తొక్కినంత సేపు వంట గదిలో దోశలు వేస్తూ వితిక బిజీగా ఉంది. దీంతో వితికా నువ్వు కిచెన్ కే పరిమితమైతే టాస్క్ ఎప్పుడు చేస్తావని పునర్నవి చెప్పింది. దీనికి వితికా నేను అంద‌రికి దోసెలు వేస్తున్నాను. ఖాళీగా ఏమి లేను క‌దా అని అంది. వితికా నువ్వు పునర్న‌విని త‌ప్పుగా అనుకుంటున్నావు అని వ‌రుణ్ సందేశ్ పున‌ర్న‌వికి స‌పోర్ట్ చేయ‌డంతో వితికా ఏడ్చింది. ఎప్ప‌టిలాగ‌నే ఆమె వ‌ద్ద‌కి వెళ్లిన మిగ‌తా ఇంటి స‌భ్యులు ఆమెని ఓదార్చారు. ఇంత‌లో జాఫ‌ర్ ఎమోష‌న‌ల్ అయిన వారిని కాసేపు వ‌దిలేస్తేనే మంచిద‌ని అన్నారు. ప‌క్కనే ఉన్న ర‌వికృష్ణ మ‌నం ఎవ‌రం వెళ్ల‌క‌పోతే వాళ్లు మ‌రోలా అనుకుంటారు. హ్యాపీగా ఉన్న టైంలో అంద‌రు వ‌స్తారు, కాని బాధ‌ని షేర్ చేసుకోవ‌డానికి ఎవ‌రు రారు అని బాధ‌ప‌డ‌తారు అని చెప్పుకొచ్చాడు.

మరోవైపు ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం సైకిల్ ఆగ‌కుండా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు తొక్కుతూనే ఉన్నారు. బాబా భాస్కర్‌, జాఫర్‌, తమన్నా, మహేష్‌లు కలిసి లివింగ్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చర్చలో భాగంగా.. శ్రీముఖిని ఎవ్వరూ ఏం చేయలేరని తమన్నా చెబుతూ ఉంటే.. తను స్ట్రాటజీతో వచ్చిందని అనుకున్నాను కానీ అలాంటిదేం లేదు అంటూ జాఫర్‌ కూడా మాట కలిపాడు. మొదటి వారం తాను, శ్రీముఖి యాక్టివ్‌గా ఉన్నామని అయితే మా మాట వినడం లేదని ఈవారం వదిలేశామని మహేష్‌ కూడా వారితో కలిసి వంతపాడాడు. ఇక రేపటి ఎపిసోడ్‌ ఎలా సాగుతుందో చూడాలి.