Tablighi Jamaat : ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజోరోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. తబ్లిగీ జమాత్ సంస్థకు చెందిన 60 మంది విదేశీయులను భోపాల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారంతా టూరిస్టు వీసాపై భారత్కు వచ్చి, ఇక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని అధికారులు పేర్కొన్నారు.
కాగా.. వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వారిపై ఇప్పటికే భోపాల్లోని పోలీసు స్టేషన్లలో 7 కేసులు నమోదయ్యాయి. స్థానిక కోర్టులో వారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో అరెస్టు చేశామని శనివారం అధికారులు తెలిపారు. అయితే మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన కార్యక్రమానికి వారు హాజరైన విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. అరెస్టైన వారిలో కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజక్స్థాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్ దేశాలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు.
Also Read: తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..