
విజయవాడలో ఇవాళ ఆర్టీసీ ఎండీతో జేఏసీ నేతల భేటీ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడంపై హర్షం వ్యక్తం చేశాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపాయి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్. 27 డిమాండ్ పరిష్కారానికి యాజమాన్యం ఒప్పుకుందని, లిఖిత పూర్వక హామీ కూడా ఇస్తామన్నారు.