బీహార్ ఎన్నికలు, కుప్ప కూలిన స్టేజీ, పప్పు యాదవ్ కి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 31, 2020 | 8:22 PM

బీహార్ ఎన్నికల ప్రచారంలో జన్ అధికార్ పార్టీ-లోక్ తాంత్రిక్ నేత రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ గాయపడ్డారు. శనివారం ముజఫర్ పూర్ జిల్లా మినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో పప్పు యాదవ్ సహా స్టేజీపై ఉన్న ఇతరులు కూడా కింద పడిపోయారు. మైక్ లో పప్పు యాదవ్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పప్పుయాదవ్ ని […]

బీహార్ ఎన్నికలు, కుప్ప కూలిన స్టేజీ, పప్పు యాదవ్ కి గాయాలు
Follow us on

బీహార్ ఎన్నికల ప్రచారంలో జన్ అధికార్ పార్టీ-లోక్ తాంత్రిక్ నేత రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ గాయపడ్డారు. శనివారం ముజఫర్ పూర్ జిల్లా మినాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో పప్పు యాదవ్ సహా స్టేజీపై ఉన్న ఇతరులు కూడా కింద పడిపోయారు. మైక్ లో పప్పు యాదవ్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పప్పుయాదవ్ ని వెంటనే ఆయన అనుచరులు పైకి లేపారు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ… చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని సమాజ్ పార్టీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోను, మరికొన్ని చిన్న పార్టీల తోను పొత్తు పెట్టుకుంది.