ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్… ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు

| Edited By: Pardhasaradhi Peri

Jul 28, 2020 | 9:16 AM

రైతుల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చేందుకే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్... ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు
Follow us on

RBKs : రైతుల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చేందుకే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే అన్న‌దాత‌ల‌కు మంచి ధ‌ర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. ప్రకృతి విధానంలో తూర్పుగోదావరి జిల్లాలో మొద‌టిసారి బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వైసీపీ నేత‌ కర్రి పాపారాయుడు పొలంలో మంత్రి కన్నబాబు, ఎంపీ(రాజ్య‌స‌భ‌) పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సోమవారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కన్న‌బాబు..రైతులకు మంచి ధర అందేలా సాగుదారుల‌కి , కొనుగోలుదారునికి మధ్య ఆర్‌బీకేల్లోని మార్కెటింగ్ సెంటర్స్ అనుసంధానంగా పనిచేస్తాయ‌ని వివ‌రించారు. సరైన ధర లేకుంటే పంట‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. ఎటువంటి అవ‌త‌వ‌క‌ల‌కు తావులేకుండా ఏడాదిలో రూ.10,200 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్ల‌లో జమ చేసిన‌ట్లు మంత్రి వివరించారు. కూలీల కొరతను అధిగమించేందుకు ఈ ఏడాది రూ.1,700 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు క‌న్న‌బాబు తెలిపారు.

Read More :ఏపీ పేద‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్..ఇళ్ల నిర్మాణానికి చౌక ధ‌రకే సామాగ్రి