ఏపీ కరోనా బులిటెన్… గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 పాజిటివ్ కేసులు..

|

Nov 28, 2020 | 6:31 PM

నిన్న వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఇక నిన్న 1,186 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 99,62,416 సాంపిల్స్‌ను పరీక్షించారు.

ఏపీ కరోనా బులిటెన్... గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 పాజిటివ్ కేసులు..
Follow us on

Ap Corona Report : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,67,063కి చేరింది. ఇందులో 1,15,71 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,48,511 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అటు నిన్న వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఇక నిన్న 1,186 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 99,62,416 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 21, చిత్తూరు 61, తూర్పుగోదావరి 54, గుంటూరు 68, కడప 19, కృష్ణా 103, కర్నూలు 22, నెల్లూరు 24, ప్రకాశం 27, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 88, విజయనగరం 29, పశ్చిమ గోదావరి 93 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.