ఉగ్రవాదుల దుశ్చర్య.. 9మంది వైద్యుల కాల్చివేత

| Edited By: Pardhasaradhi Peri

May 29, 2020 | 12:45 PM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్‌ షబాబ్‌ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్‌ చేశారు. ఆ […]

ఉగ్రవాదుల దుశ్చర్య.. 9మంది వైద్యుల కాల్చివేత
Follow us on

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్‌ షబాబ్‌ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. దేశంలోని మిడిల్‌ షాబెల్లీ ప్రావిన్స్‌ ప్రాంతంలోని బలాద్‌ నగరంలో ఈ తొమ్మిది మంది డాక్టర్ల డెడ్‌ బాడీస్ దర్శనమిచ్చాయి. వీరంతా యువ డాక్టర్లని గుర్తించారు. స్థానిక ఆస్పత్రుల్లో వీరంతా ఉద్యోగం చేసేవారని అధికారులు తెలిపారు. కాగా, సోమాలియా దేశంలో 1990 నుంచి ఉగ్రవాదుల ఆగడాలు.. స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.