సుశాంత్ కెరీర్ను నాశనం చేసింది ‘ఆ నలుగురే’…
గత కొద్దికాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై యుద్ధం చేస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాంతరం తన స్వరాన్ని మరింతగా పెంచింది. బాలీవుడ్లోని కొందరు ప్రముఖుల పేర్లను బయటపడుతూ..
Kangana Ranaut Fires On Bollywood Producers: గత కొద్దికాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై యుద్ధం చేస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాంతరం తన స్వరాన్ని మరింతగా పెంచింది. బాలీవుడ్లోని కొందరు ప్రముఖుల పేర్లను బయటపడుతూ.. వారిని ‘మూవీ మాఫియా’గా అభివర్ణించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ సంచలన కామెంట్స్ చేసింది.
బాలీవుడ్లో ప్రముఖులైన కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్, జావేద్ అక్తర్లు ‘మూవీ మాఫియా’గా మారారని.. వీళ్లే సుశాంత్ కెరీర్ను నాశనం చేశారని ఆరోపించింది. సుశాంత్కు ఎన్నో సమస్యలు సృష్టించి.. మానసికంగా కృంగదీశారంది. వీరందరూ కూడా స్టార్ హీరోల వారసులను తప్పితే.. బయటవారిని ఇండస్ట్రీలో ఎదగనివ్వరని కంగనా విమర్శించింది. అటు సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసుల పనితీరు మెరుగ్గా లేదని కంగనా రనౌత్ తెలిపింది.
కాగా, సుశాంత్ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హాఫ్ సుశాంత్ ఆత్మతో సంప్రదించినట్లుగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని స్పిరిట్ సెషన్స్ కూడా చేసే అవకాశం ఉందని స్టీవ్ అభిమానులకు తెలిపిన సంగతి విదితమే.
Also Read:
Part 3: ”సుశాంత్ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…
Part: 2: సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..