జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. వివరాలివే

గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష-2020‌ ఫలితాలను ఢిల్లీ ఐటీటీ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. వివరాలివే
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2020 | 12:03 PM

JEE Advanced results: గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష-2020‌ ఫలితాలను ఢిల్లీ ఐటీటీ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ jeeadv.ac.inలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చునని ఈ సందర్భంగా తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఈ ఏడాది లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ పరీక్షల్లో  352/396 స్కోర్‌ సాధించిన చిరాగ్‌ ఫలోర్‌ టాపర్‌గా నిలిచారు. అలాగే 315 మార్కులు సాధించిన కనిష్క మిట్టల్‌ బాలికల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ఇక ఈనెల 6 నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జాయింట్ సీట్‌ అలాకేషన్ అథారిటీ(జోసా) ఏర్పాట్లు చేసింది.

Read More:

మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య?

చనిపోయిన భర్త ఫొటోతో నటి మేఘనా రాజ్‌ సీమంతం