కిడ్నాప్‌కు గురైన బీజేపీ నేతను కాపాడిన పోలీసులు

జమ్ముకశ్మీర్‌లో బుధవారం తెల్లవారు జామున బీజేపీ నేత మెహరాజుద్దీన్‌ మల్లాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పన్నెండు గంటల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు ఆయన్ని..

కిడ్నాప్‌కు గురైన బీజేపీ నేతను కాపాడిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 5:05 AM

జమ్ముకశ్మీర్‌లో బుధవారం తెల్లవారు జామున బీజేపీ నేత మెహరాజుద్దీన్‌ మల్లాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పన్నెండు గంటల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు ఆయన్ని రక్షించారు. కిడ్నాపర్లు ఆయనకు ఎలాంటి హామీ తలపెట్టలేదని మల్లా తెలిపారు. సోపోర్ నగరానికి వెళ్తుండగా. రాఫియాబాద్‌ సమీపంలోని మరాజిగుండ్‌ వద్ద దుండగులు అతడిని కిడ్నాప్ చేసినట్లు మెహరాజుద్దీన్‌ తెలిపారు. మెహరాజుద్దీన్‌ ప్రస్తుతం వాటర్ గామ్ మున్సిపల్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. తన మిత్రుడిని కలిసేందుకు వెళ్తుండగా.. ఓ కారులో వచ్చి బలవంతంగా అందులోకి లాగి కిడ్పాప్ చేసినట్లు తెలిపారు. అయితే ఎట్టకేలకు పన్నెండు గంటల తర్వాత పోలీసులు ఆయన్ను కిడ్నాపర్ల నుంచి రక్షించారు. పోలీసులు ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టిన క్రమంలో.. కిడ్నాపర్లు ఆయనకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వదిలిపెట్టారు.

కాగా, వారం రోజుల క్రితమే బందిపొరా జిల్లాలో బీజేపీ నేత వసీం బరితో పాటు ఆయన తండ్రిని సోదరుడిని ఉగ్రవాదులు కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే.