ఇజ్రాయెల్లో మరోసారి మూడువారాల లాక్డౌన్
లాక్డౌన్ను విధించి, అందుకు సంబంధించిన నియమ నిబంధనలకు కఠినాతికఠినంగా అమలు చేసినా కరోనా వైరస్ మాత్రం కట్టడి కాలేదు. పైపెచ్చు అది మరింతగా వ్యాప్తి చెందుతూ వెళుతోంది..
లాక్డౌన్ను విధించి, అందుకు సంబంధించిన నియమ నిబంధనలకు కఠినాతికఠినంగా అమలు చేసినా కరోనా వైరస్ మాత్రం కట్టడి కాలేదు. పైపెచ్చు అది మరింతగా వ్యాప్తి చెందుతూ వెళుతోంది.. లాక్డౌన్ల కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు, లేనిపోని సమస్యలు కూడా తలెత్తడంతో ప్రభుత్వాలు నెమ్మదిగా లాక్డౌన్ను సడలించడం మొదలుపెట్టాయి.. ఆన్లాక్తో చాలా వాటిని సడలించాయి.. అయితే కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా లాక్డౌన్లోనే ఉన్నాయి.. ఇక ఇజ్రాయెల్ అయితే మరోసారి లాక్డౌన్ విధించాలనే కఠిన నిర్ణయానికి వచ్చింది.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు బాగా పెరుగుతుండటంతో మూడు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. మూడు వారాల పాటు కఠినమైన లాక్డౌన్కు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మూడు వారాల తర్వాత పరిస్థితిని బట్టి లాక్డౌన్ను పొడిగించడమా లేక తొలగించడమా అన్నది ఆలోచిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్లో రోజుకు నాలుగు వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇజ్రాయెల్ ఆర్ధిక వ్యవస్థ పెను సంక్షోభంలో పడింది.. ఇప్పుడు రెండోసారి లాక్డౌన్ విధిస్తే కనీసం 1.88 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఆ దేశ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప అన్నింటినీ మూసివేస్తున్నారు. దేశంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.. అయితే యూదుల కొత్త సంవత్సరానికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.. యూకోవ్ లిట్జ్మాన్ అనే మంత్రి అయితే తన పదవికి రాజీనామా కూడా చేశారు.. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 1,53,759 కరోనా కేసులు నమోదయ్యాయి.. వెయ్యికి పైగా ప్రజలు మరణించారు.. దీనికే అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ ఆందోళనలు చేశారు..