ఐపీఎల్ 2020: ఫ్యాన్స్కు బీసీసీఐ మరో సర్ప్రైజ్..!
ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఫైనల్ను అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరపాలని యోచిస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్ను కూడా త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ. అహ్మదాబాద్లోని మోతేర ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సుమారు 63 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. లక్షా పది వేల సీట్లు కెపాసిటీ గలిగిన […]
ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2020 ఫైనల్ను అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరపాలని యోచిస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ షెడ్యూల్ను కూడా త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ.
అహ్మదాబాద్లోని మోతేర ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సుమారు 63 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. లక్షా పది వేల సీట్లు కెపాసిటీ గలిగిన ఈ మైదానంలో ఒక క్లబ్ హౌస్, 50 రూములు, పెద్ద స్విమ్మింగ్ పూల్, 76 కార్పొరేట్ బాక్స్లు ఉండనున్నాయి.
వచ్చే ఏడాది మార్చికి పూర్తి కానున్న దీనిలో వరల్డ్ XI వెర్సస్ ఆసియా XI మ్యాచ్ జరగనుంది. అంతేకాకుండా దీని పిచ్ను అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడేందుకు అనుగుణంగా క్యూరేటర్లు సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ లాంటి మెగా లీగ్ ఫైనల్ మ్యాచ్ ఇలాంటి పెద్ద స్టేడియంలో చూస్తే ఆ మజానే వేరు.