తుపాకీతో కనిపిస్తే కాల్చిపారేస్తామన్న ఇండియన్ ఆర్మీ
ఎవరైనా తుపాకీతో కనిపిస్తే వాళ్లను వెంటనే తుద ముట్టిస్తామని ఇండియన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. కశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత.. ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ కమాండర్ కన్వల్జిత్ సింగ్ దిల్లాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చారు. గన్ పట్టుకుని తిరిగేవాళ్లను రూపుమాపేస్తామన్నారు. పుల్వామా ఫిదాయిన్ దాడి జరిగిన తర్వాత వంద గంటల్లోనే ఆ దాడికి కారణమైన జైషే ఉగ్రవాదులను హతం […]
ఎవరైనా తుపాకీతో కనిపిస్తే వాళ్లను వెంటనే తుద ముట్టిస్తామని ఇండియన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. కశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత.. ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ కమాండర్ కన్వల్జిత్ సింగ్ దిల్లాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చారు. గన్ పట్టుకుని తిరిగేవాళ్లను రూపుమాపేస్తామన్నారు. పుల్వామా ఫిదాయిన్ దాడి జరిగిన తర్వాత వంద గంటల్లోనే ఆ దాడికి కారణమైన జైషే ఉగ్రవాదులను హతం చేశామన్నారు. ఈనెల 14వ తేదీన జరిగిన కారు బాంబు దాడి ఘటనపై స్పందిస్తూ.. చాన్నాళ్ల తర్వాత కశ్మీర్లో అలాంటి వ్యూహాన్ని అమలు చేశారన్నారు. ఫిదాయిన్ దాడులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు కార్ప్స్ కమాండర్ కన్వల్జిత్ సింగ్ దిల్లాన్ తెలిపారు.