అమరుడికి నివాళులు అర్పించిన ఇండియన్ ఆర్మీ
జమ్ముకశ్మీర్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ వీరమరణం పొందారు. సౌత్ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో నాయక్ రాజ్వీందర్ సింగ్ ముష్కరులతో యుద్ధం చేస్తూ..
జమ్ముకశ్మీర్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్ వీరమరణం పొందారు. సౌత్ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో నాయక్ రాజ్వీందర్ సింగ్ ముష్కరులతో యుద్ధం చేస్తూ.. భారత మాత ఒడిలో ఒరిగిపోయాడు. ఈ క్రమంలో ఆయన భౌతిక కాయానికి బుధవారం నాడు ఇండియన్ ఆర్మీ నివాళులు అర్పించింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సౌత్ కశ్మీర్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు.
కాగా, గత కొద్ది రోజులుగా లోయలో రోజు ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
Indian Army today paid tribute to Late Naik Rajwinder Singh, who made the supreme sacrifice in South Kashmir yesterday. In a solemn ceremony at BB Cantt, Lt Gen BS Raju, Chinar Corps Commander and all ranks paid homage to the braveheart on behalf of the proud nation: Army pic.twitter.com/DFPbDxbzS9
— ANI (@ANI) July 8, 2020