అనుష్క అమాయకత్వం… ఆడుకుంటున్న నెటిజన్లు!

ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గేమ్‌లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలో సందడి చేసింది. భారత ఆటగాళ్లు కొట్టిన ప్రతి షాట్‌కు అనుష్క చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. రంజిత బౌలింగ్‌లో […]

అనుష్క అమాయకత్వం... ఆడుకుంటున్న నెటిజన్లు!
Follow us

|

Updated on: Jul 07, 2019 | 11:42 PM

ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గేమ్‌లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలో సందడి చేసింది. భారత ఆటగాళ్లు కొట్టిన ప్రతి షాట్‌కు అనుష్క చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది.

ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. రంజిత బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఫోర్ కొట్టి తన పరుగుల ఖాతా తెరిచాడు. ఇక అనుష్క శర్మ ఆ ఫోర్‌ను సింబాలిక్‌గా చూపించే ప్రయత్నం చేసింది. అయితే అది తెలియక ప్రక్కనే కూర్చున్న వ్యక్తిని ఎలా చూపించాలో అడిగింది. ఇకపోతే ఈ తతంగం కాస్తా కెమెరాకు చిక్కడంతో.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

దీంతో నెటిజన్లు అనుష్క‌పై సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీకి సరైన భార్య దొరికిందని, ఫ్లైయింగ్ కిస్‌ల కోసమే మ్యాచ్ చూస్తున్నావా.. ఇన్నాళ్లు ఏం తెలుసుకున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.