Chittoor District: గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకు వెళ్లాలంటే గ్రామ ప్రజలు ప్రాణాలను అడ్డుపెట్టి సాహసం చేయాల్సిందే.. ఇదీ.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో ప్రజల దుర్భర పరిస్థితి.
నెల వాయి గ్రామానికి చెందిన 70 ఏళ్ల సావిత్రమ్మ బుధవారం అనారోగ్యంతో మరణించింది. ఆమె శవాన్ని వాగు దాటుకుంటూ స్మశానానికి నీటి ప్రవాహంలో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. తమ కష్టం చూసి ఇకనైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తమ గ్రామ స్మశానానికి వెళ్లే దారికి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read also: YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే ఉదారత.. సొంత డబ్బుతో రైతులకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ