
భారతదేశంలో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది.. పెద్ద సంఖ్యలో ప్రజలు దీనికి బలైపోతున్నారు. మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.. దాని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం.. ఈ ప్రక్రియ జరిగినప్పుడు కాల్షియం, సోడియం, అనేక రకాల ఖనిజాల కణాలు మూత్ర నాళం ద్వారా మూత్రాశయానికి చేరుతాయి. ఈ వస్తువుల పరిమాణం పెరగడం ప్రారంభమైన తరువాత అవి ఘనీభవించి రాయి ఆకారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాయి.. దీనిని రాళ్లుగా పిలుస్తారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే కిడ్నీల్లో రాళ్ల ప్రమాదం మరింత పెరిగి.. అత్యవసర పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు.. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, తరచుగా టాయిలెట్కు వెళ్లడం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, నడుము ప్రాంతంలో నొప్పి.. వికారం గురించి ఫిర్యాదు చేస్తారు.. అటువంటి పరిస్థితిలో అలాంటి వారు.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం..
డైటీషియన్ల ప్రకారం.. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేకపోతే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
విటమిన్ సి ఆధారిత ఆహారాలు: రాళ్ల సమస్య ఉన్నట్లయితే, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా మరిన్ని రాళ్ళు ఏర్పడటం ప్రారంభిస్తాయి. నిమ్మ, పాలకూర, నారింజ, ఆవాలు, కివి, జామ వంటి వాటిని తినడం మానేయడం మంచిది.
శీతల పానీయాలు – టీ-కాఫీ: మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు.. అలాంటి సందర్భంలో కెఫిన్ శరీరానికి హానికరం కావచ్చు. అందువల్ల, శీతల పానీయాలు, టీ-కాఫీలు కిడ్నీల్లో రాళ్లు ఉన్న రోగులకు విషం కంటే తక్కువ కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉప్పు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉప్పు, అత్యధిక ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది.. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మాంసాహారం: మాంసం, చేపలు, గుడ్లు.. కూడా కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.. ఈ పోషకం శరీరానికి ఎంత ముఖ్యమైనదైనా, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవడం, వైద్యం పొందడం ముఖ్యం.. అలానే వైద్యులు చెప్పిన విధంగా ఆహారాలను తీసుకోవాలి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..