పాకిస్థాన్కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్..
పొరుగు దేశం పాకిస్థాన్కు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా భారత్తో చర్చలకు ప్రయత్నిస్తుంటే.. మోదీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదంటూ పాక్ చేస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఎటాక్ చేశారు. మీకు నిజంగా మాతో చర్చలు జరపాలని ఉంటే.. వెంటనే మీ దేశంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను, టెర్రరిస్టులను భారత్కు అప్పగించాలంటూ పాక్కు సూచించారు. ఇటీవల జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం […]
పొరుగు దేశం పాకిస్థాన్కు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా భారత్తో చర్చలకు ప్రయత్నిస్తుంటే.. మోదీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదంటూ పాక్ చేస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఎటాక్ చేశారు. మీకు నిజంగా మాతో చర్చలు జరపాలని ఉంటే.. వెంటనే మీ దేశంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను, టెర్రరిస్టులను భారత్కు అప్పగించాలంటూ పాక్కు సూచించారు.
ఇటీవల జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాక్ల మధ్య దూరం అమాంతం పెరిగింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. పాకిస్థాన్ విదేశాగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మేము స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని.. కానీ భారత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడంలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయన్నారు. అయితే పాక్ విదేశాంగా మంత్రి వ్యాఖ్యలపై జైశంకర్ గట్టి సమాధానమే ఇచ్చారు.
భారత్తో సత్సంబంధాల్ని పెట్టుకోవాలని పాకిస్థాన్ నింజగా పరితపిస్తే.. దావుద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యీద్ లాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, క్రిమినల్స్ను భారత్కు అప్పగించాలన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన మాట నిజమేనన్న మంత్రి.. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ ఓ టెర్రరిస్ట్ హబ్గా మారడమేనన్నారు. భారత్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందన్నారు. నిజంగా పాకిస్థాన్ చర్చలకు సుముఖత చూపితే.. తొలుత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.