మాజీ ఎంపీ హర్షకుమార్కు చంద్రబాబు షాక్
మాజీ ఎంపీ హర్షకుమార్కు టీడీపీ అధినేత నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల టీడీపీలో చేరిన హర్ష కుమార్ అమలాపురం ఎంపీ టికెట్ను ఆశించగా.. ఇప్పుడు ఆ టికెట్ను చంద్రబాబు గంటి హరీశ్కు కేటాయించారు. దీంతో హర్ష కుమార్కు షాక్ తగిలినట్లైంది. కాగా 2014లో అమలాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు ఇటీవల వైసీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీ తరపున ఆ స్థానం నుంచి తనకు టికెట్ వస్తుందని […]
మాజీ ఎంపీ హర్షకుమార్కు టీడీపీ అధినేత నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల టీడీపీలో చేరిన హర్ష కుమార్ అమలాపురం ఎంపీ టికెట్ను ఆశించగా.. ఇప్పుడు ఆ టికెట్ను చంద్రబాబు గంటి హరీశ్కు కేటాయించారు. దీంతో హర్ష కుమార్కు షాక్ తగిలినట్లైంది.
కాగా 2014లో అమలాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు ఇటీవల వైసీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీ తరపున ఆ స్థానం నుంచి తనకు టికెట్ వస్తుందని హర్ష కుమార్ ఆశించారు. అయితే తాజా లిస్ట్లో ఆయన పేరును చంద్రబాబు ప్రకటించలేదు. అంతేకాదు ఎమ్మెల్యే సీటును కూడా హర్ష కుమార్కు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. దీంతో హర్ష కుమార్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది.
కాగా రాజశేఖర్ రెడ్డి హయాంలో తూర్పు గోదావరి జిల్లాలో కీలకపాత్ర పోషించారు హర్ష కుమార్. కానీ ఇప్పుడు ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఆసక్తిని చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.